సిద్దిపేట జోన్: ఒక్కొక్కరూ ఒక్కో మొక్క నాటి మెతుకుసీమను హరితవనంలా మార్చాలని రాష్ట్ర నీటి పారుదల, మైనింగ్, మార్కెటింగ్ శాఖల మంత్రి హరీష్రావు పిలుపునిచ్చారు. శనివారం ఆయన సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని రంగధాంపల్లి, గణేష్నగర్, శ్రీనగర్, పత్తిమార్కెట్ యార్డు, హిందూ శ్మశాన వాటికల్లో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు భవిష్యత్లో తలెత్తకూడదనే ప్రభుత్వం వన మహోత్సవానికి ప్రాధాన్యత నిచ్చిందన్నారు. ఈ క్రమంలోనే సిద్దిపేట పట్టణంలో ఈ సంవత్సరం లక్ష మొక్కలను నాటాలని నిర్ణయించామన్నారు. అందుకోసం తన సొంత నిధులు సైతం వెచ్చించి వివిధ నర్సరీలు, అటవీశాఖ సహకారంతో మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టానన్నారు. అందులో భాగంగానే తొలివిడతగా శనివారం 50 వేల మొక్కలను పంపిణీ చేస్తామన్నారు.
మొక్కలు తీసుకున్న ప్రజలు కూడా వాటిని నాటడంతోనే తమ బాధ్యత తీరిపోయిందని భావించకుండా, వాటిని సంరక్షించాలని కోరారు. ప్రస్తుతం కనిపిస్తున్న కరువు ఛాయలు భవిష్యత్లో రాకూడదనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా వన మహోత్సవానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామన్నారు. అందుకోసం అటవీశాఖకు బడ్జెట్లో రూ.700 కోట్లను కేటాయించినట్లు హరీష్రావు తెలిపారు. అనంతరం స్థానిక శ్రీనగర్, గణేష్నగర్ కాలనీలో మహిళలకు మొక్కలను పంపిణీ చేసి లాంఛనంగా మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మొక్కలు స్వీకరించిన ప్రతి ఒక్కరి నుంచి అధికారులు దత్తత పత్రాలను తీసుకున్నారు. కార్యక్రమంలో సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, డీఎస్పీ శ్రీధర్రెడ్డి, విద్యుత్ డీఈ శ్రీనివాసరెడ్డి, నీటి పారుదల శాఖ ఈఈ ఆనంద్, డిప్యూటీ ఈఓ మోహన్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, తహశీల్దార్ ఎన్వై గిరి, మార్కెట్ శాఖ కార్యదర్శి సంగయ్య, విద్యుత్ ఏడీఈ శ్రీనివాస్, హౌసింగ్ డీఈ సత్యనారాయణ, ఏఈ సుధాకర్గౌడ్, శానిటరీ ఇన్స్పెక్టర్ కృష్ణారెడ్డి, టీపీఎస్ ప్రభాకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, మాజీ వైస్ చైర్మన్ చిన్నా తదితరులు పాల్గొన్నారు.
మెతుకుసీమను హరితవనం చేద్దాం
Published Sat, Jul 19 2014 11:50 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement