బావిలో మృతదేహం | dead body found in well | Sakshi
Sakshi News home page

బావిలో మృతదేహం

Aug 1 2015 4:42 PM | Updated on Oct 17 2018 6:06 PM

రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన ఒక వ్యక్తి బావిలో శవంగా కనిపించాడు.

తాడ్వాయి (నిజామాబాద్ జిల్లా) : రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన ఒక వ్యక్తి బావిలో శవంగా కనిపించాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం సంగోజీవాలి గ్రామంలో శనివారం వెలుగుచూసింది. వివరాల ప్రకారం.. మండలంలోని చందాపూర్ గ్రామానికి చెందిన పెద్దరాజు కిష్టయ్య(35) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం కూలీ పనుల కోసం ఇంటి నుంచి వెళ్లిన రాజు కనిపించకుండా పోయాడు. కాగా తాజాగా శనివారం సంగోజీవాలి గ్రామంలోని బావిలో శవంగా కనిపించాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని బావి నుంచి వెలికితీసి పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement