తెలంగాణలో కొత్తగా 117 పాజిటివ్‌ కేసులు | Coronavirus: 117 New Positive Cases Reported In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కొత్తగా 117 పాజిటివ్‌ కేసులు

May 28 2020 9:07 PM | Updated on May 28 2020 9:25 PM

Coronavirus: 117 New Positive Cases Reported In Telangana - Sakshi

సాక్షి, హైదారాబాద్‌: తెలంగాణలో గురువారం ఒక్కరోజే 117 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,216 కి చేరింది. గడిచిన 24 గంటల్లో నలుగురు కరోనా బాధితులు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 67కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో తెలంగాణకు చెందినవారు 66 మంది, వలసదారులు ఇద్దరు, విదేశాల నుంచి వచ్చిన వారిలో 49 మంది ఉన్నారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం రాత్రి హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ఇప్పటివరకు 1345 మంది డిశ్చార్జి అయ్యారని వివరించారు. ప్రస్తుతం 844 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement