'కేసీఆర్‌ అన్ని వర్గాలను మోసం చేశారు' | congress leader uttam kumar reddy slams cm kcr | Sakshi
Sakshi News home page

'కేసీఆర్‌ అన్ని వర్గాలను మోసం చేశారు'

Sep 20 2017 4:27 PM | Updated on Sep 19 2019 8:44 PM

కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత అన్ని వర్గాలను మోసం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి విమర్శించారు.

పరిగి: కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత అన్ని వర్గాలను మోసం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి విమర్శించారు. వికారాబాద్‌ జిల్లా పరిగిలో బుధవారం ఆయన మాట్లాడుతూ ల్యాండ్ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో అందరూ రైతులు పాల్గొనాలని కోరారు. టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో అర్హులైన దళిత కుటుంబాలకు భూమి ఇస్తా అన్న కేసీఆర్ మూడేళ్లలో మూడు వేల మందికి కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు.
 
ఇరిగేషన్ ప్రాజెక్టులకు, మిషన్ భగీరథకు ఏక కాలంలో డబ్బులు ఇస్తాడు కానీ, రైతులకు రుణమాఫీ ఇవ్వడానికి మాత్రం కేసీఆర్ వద్ద డబ్బులు లేవని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఈ మూడేళ్లలో 3500 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement