రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి | A Boy Died In Road Accident In Khammam | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

Jul 6 2019 12:52 PM | Updated on Jul 12 2019 3:02 PM

A Boy Died In Road Accident In Khammam - Sakshi

శ్యామ్‌ శ్రీ

సాక్షి, దమ్మపేట(ఖమ్మం) : రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందిన విషాదకర సంఘటన శుక్రవారం మండలంలోని మందలపల్లిలో జరిగింది. మందలపల్లిలో కేతినేని పవన్‌ అనే వ్యక్తి హోటల్‌ నడుపుతూ కుటుబాన్ని పోషించుకుంటున్నాడు. శుక్రవారం ఉదయం పవన్‌ కుమారుడు కేతినేని విజయ్‌ శ్యామ్‌ శ్రీ (7) హోటల్‌కు వద్దామని రోడ్డుపైకి చేరుకోగా..అదే సమయంలో సత్తుపల్లి నుంచి అశ్వారావుపేట వైపు అతివేగంగా, అజాగ్రత్తగా వస్తున్న లారీ విజయ్‌ శ్యామ్‌శ్రీ ని ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన లారీ ఆపకుండా వెళుతుండగా గ్రామస్తులు వెంబడించి అశ్వారావుపేటలో ఆపారు. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్నున్నట్లు దమ్మపేట పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందడంతో మందలపల్లిలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని స్థానికులు ఆందోళన నిర్వహించి, స్థానిక అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement