
ఓటు బ్యాంకు రాజకీయాలు ప్రమాదకరం
ఓటు బ్యాంక్ రాజకీయాలు దేశానికి చాలా ప్రమాదకరమని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం అదే దారిలో పయనిస్తున్నాడని బండారు దత్తాత్రేయ అన్నారు.
సర్కారు అధికారికంగా నిర్వహించకపోయినా సెప్టెంబర్ 17న ప్రతి గ్రామంలో, కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ జెండాలు ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరిపేలా చూస్తామని చెప్పారు. సెప్టెంబర్ 17న నిజామాబాద్లో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తోందని, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ హాజరవుతారని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మజ్లీస్ పార్టీకి టీఆర్ఎస్ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని, ఓటుబ్యాంకు రాజకీయాలు మానుకోవాలని అన్నారు.