ఏసీబీకి చిక్కిన వీఆర్వో | acb caught vro | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన వీఆర్వో

May 7 2015 4:15 PM | Updated on Sep 22 2018 8:22 PM

రూ.8 వేలు లంచం తీసుకుంటూ మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లె వీఆర్వో జీ.రామేశ్వరరావు ఏసీబీ అధికారులకు చిక్కాడు.

సంగారెడ్డి (మెదక్ జిల్లా):  రూ.8 వేలు లంచం తీసుకుంటూ మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లె వీఆర్వో జీ.రామేశ్వరరావు ఏసీబీ అధికారులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. పోతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన రైతులు బాలయ్య, అనంతయ్య, అంజయ్యలు ఆన్‌లైన్‌లో భూమి పట్టాలకు సంబంధించిన పేరు మార్పుల విషయంపై వీఆర్వోను సంప్రదించారు. కాగా అతను రూ. 45 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధిత రైతులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం గురువారం.. బాలయ్య, అనంతయ్య, అంజయ్యల మనవడు ఆనంద్ల నుంచి వీఆర్వో రూ.8వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement