తెలంగాణలో మరో 52 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటెన్లో ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా వైరస్ బారినపడిన వారి సంఖ్య 1,813కు చేరుకుంది. ఇవాళ కరోనా వైరస్తో ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో 49 మంది మృతి చెందారు. శనివారం కరోనా నుంచి కోలుకుని 25 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు 1068 డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 33, ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారిలో 19 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. తెలంగాణలో ప్రస్తుతం 696 యాక్టివ్ కేసులు ఉన్నాయి.