ఫారెస్ట్ అధికారులపై కలప స్మగ్లర్ల దాడి, 11మంది అరెస్ట్ | 11 held, Timber smugglers attacked forest officers | Sakshi
Sakshi News home page

ఫారెస్ట్ అధికారులపై కలప స్మగ్లర్ల దాడి, 11మంది అరెస్ట్

Dec 31 2014 7:06 AM | Updated on Oct 8 2018 5:04 PM

కలప స్మగ్లింగ్ కార్యకలాపాలు యథేచ్చగా కొనసాగుతోంది.

మహబూబ్ నగర్: కలప స్మగ్లింగ్ కార్యకలాపాలు యథేచ్చగా కొనసాగుతోంది. స్మగ్లింగ్ వ్యవహారాన్ని అడ్డుకునేందుకు ఫారెస్ట్ అధికారులు, పోలీసులు ఎప్పటికప్పుడూ చర్యలు చేపడుతూనే ఉన్నారు. అందిన సమాచారం మేరకు మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలం కోడుగల్లులో అధికారులు తనిఖీలు చేపట్టారు.

అక్రమంగా తరలిస్తున్న కలప స్మగ్లర్లను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు యత్నించారు. దాంతో కలప స్మగ్లర్లు దౌర్జన్యానికి దిగారు. అక్రమంగా తరలిస్తున్న కలప రవాణాను అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులపై దుండగులు దాడి చేశారు. దాంతో 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement