వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా 35 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది.
సిడ్నీ:వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా 35 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. ప్రస్తుతం అజ్యింకా రహానే(43), కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(29)పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
ఆసీస్ విసిరిన 329 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా 108 పరుగులకే నాలుగు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. సురేష్ రైనా(7), రోహిత్ శర్మ(34) , విరాట్ కోహ్లీ(1), శిఖర్ ధావన్ (45) లు పెవిలియన్ కు చేరారు.