మలేసియన్ ఓపెన్ సెమీపోరులో సైనా ఓటమి | Saina loses in Malaysia Open semis | Sakshi
Sakshi News home page

మలేసియన్ ఓపెన్ సెమీపోరులో సైనా ఓటమి

Apr 4 2015 12:32 PM | Updated on Sep 2 2017 11:51 PM

మలేసియన్ ఓపెన్ సెమీపోరులో  సైనా  ఓటమి

మలేసియన్ ఓపెన్ సెమీపోరులో సైనా ఓటమి

మలేషియా ఓపెన్ సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ , భారత క్రీడాకారిణి సైనానెహ్వాల్ నిష్ర్కమించింది.

కౌలాలంపూర్ : మలేషియా ఓపెన్ సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ , భారత క్రీడాకారిణి సైనానెహ్వాల్  నిష్ర్కమించింది.  చైనా క్రీడాకారిణి  లీ జురుయ్ చేతిలో ఆమె  ఓటమి పాలైంది.  శనివారం జరిగిన ఈ  మ్యాచ్ లో  లండన్ ఒలింపిక్స్ విజేత, టాప్ సీడ్ లీ జురుయ్‌తో సైనా  పోరాడి  ఓడింది. హోరా హోరీగా జరిగిన  ఈ సెమీ పోరులో  13-21, 21-17, 22-20  పాయింట్ల తేడాతో ఆమె పరాజయాన్ని చవిచూడాల్సి  వచ్చింది.  రెండుసార్లు చైనాకు దీటుగా నిలిచిన సైనా మూడవసారి ఓటమిని మూటగట్టుకుంది.

శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో  సైనా 21-11, 18-21, 21-17తో ప్రపంచ 15వ ర్యాంకర్ సున్ యు (చైనా)పై విజయం సాధించి సెమీఫైనల్కి ప్రవేశించిన సంగతి తెలిసిందే. దీంతో మలేసియా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌ పోరులో భారత్  తప్పుకున్నట్లే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement