ఐపీఎల్‌ చరిత్రలో తొలి క్రికెటర్‌గా.. | Raina becomes the first player to score 300 Plus in each of the 11 editions of IPL | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ చరిత్రలో తొలి క్రికెటర్‌గా..

May 11 2018 9:23 PM | Updated on May 11 2018 9:44 PM

Raina becomes the first player to score 300 Plus in each of the 11 editions of IPL - Sakshi

జైపూర్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో చెన‍్నై సూపర్‌ సింగ్స్‌ ఆటగాడు సురేశ్‌ రైనా అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో ప్రతీ సీజన్‌లో మూడొందలకు పైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా రైనా రికార్డు సాధించాడు. శుక్రవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌ ద్వారా రైనా ఈ ఫీట్‌ నమోదు చేశాడు. సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో భాగంగా 10 ఓవర్‌ రెండో బంతికి రైనా ఈ సీజన్‌లో మూడొందల పరుగుల మార్కును చేరాడు. ఫలితంగా ప్రతీ ఐపీఎల్‌ సీజన్‌లో మూడొందలకు పైగా పరుగులు సాధించిన ఏకైక క్రికెటర్‌గా రైనా గుర్తింపు సాధించాడు. మరొకవైపు గడిచిన ఐపీఎల్‌-10 సీజన్‌లలో రైనా టాప్‌-10లో నిలవడం ఇక్కడ విశేషం. ఈ మ్యాచ్‌లో రైనా(52) హాఫ్‌ సెంచరీ సాధించిన తర్వాత  మూడో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. రాజస్తాన్‌ రాయల్స్‌పై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కూడా రైనా(557)  మరో ఘనతను సొంతం చేసుకున్నాడు.

ప్రతీ సీజన్‌లో రైనా ఓవరాల్‌ స్కోర్లు

2018-313 పరుగులు(ప్రస్తుతానికి)
2017-442 పరుగులు
2016-399 పరుగులు
2015-374 పరుగులు
2014-523 పరుగులు
2013-548 పరుగులు
2012-441 పరుగులు
2011-438 పరుగులు
2010-520 పరుగులు
2009-434 పరుగులు
2008-421 పరుగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement