సెంచరీతో ఆదుకున్న పుజారా | pujara makes career seventh century in colombo | Sakshi
Sakshi News home page

సెంచరీతో ఆదుకున్న పుజారా

Aug 29 2015 2:52 PM | Updated on Nov 9 2018 6:43 PM

సెంచరీతో ఆదుకున్న పుజారా - Sakshi

సెంచరీతో ఆదుకున్న పుజారా

శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న మూడో టెస్టులో చటేశ్వర్ పుజారా సెంచరీ చేయడంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్ చేరుకుంది.

శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న మూడో టెస్టులో చటేశ్వర్ పూజారా సెంచరీ చేయడంతో భారత్ గౌరవ ప్రదమైన స్కోర్ చేసింది. 214 బంతులు ఎదుర్కొన్న పుజారా తొమ్మిది బౌండరీలతో సెంచరీ పూర్తి చేశాడు. టాపార్డర్ నిరాశ పరిచినా యువ బ్యాట్స్ మెన్  నమన్ ఓజా, స్పిన్నర్ అమిత్  మిశ్రా పుజారాకు సహకరించడంతో టీ విరామ సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.

వర్షం కారణంగా తొలి రోజు ఆట రద్దు కావడంతో రెండు వికెట్ల నష్టానికి 50 పరుగుల వద్ద రెండోరోజు ఆట ప్రారంభించిన టీమిండియా టాపార్డర్  ఇబ్బంది పడింది. తర్వాత వన్ డౌన్ బ్యాట్స్ మెన్ పుజారా.. బ్యాటింగ్ బాధ్యతను భుజాన వేసుకున్నాడు. రోహిత్  శర్మ, నమన్ ఓజా ఇద్దరూ పుజారాకు సహకరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement