ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన పఠాన్‌

Irpan Pathan All Round Show In Road Safety World Series In Mumbai - Sakshi

ముంబై : ఇర్ఫాన్‌ పఠాన్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో భారత జట్టు సునాయాస విజయాన్ని చేజెక్కించుకుంది. అదేంటి పఠాన్‌ ఈ మధ్యనే ఆటకు వీడ్కోలు పలికాడుగా.. మ్యాచ్‌ ఎప్పుడు ఆడాడనేగా మీ సందేహం.. ఏం లేదండి రోడ్‌ సేప్టీపై అవగాహన పెంచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వరల్డ్‌ రోడ్‌ సేప్టీ సిరీస్‌ నిర్వహిస్తోంది. ఈ సిరీస్‌లో పలువురు భారత మాజీ ఆటగాళ్లు ఆడుతున్నారు. కాగా ఇండియా లెజెండ్స్‌ జట్టుకు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో శ్రీలంక లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
(సెహ్వాగ్‌ అదే బాదుడు)

ముందుగా బ్యాటింగ్‌ దిగిన శ్రీలంక లెజెండ్స్‌ మునాఫ్‌ పటేల్‌ 4 వికెట్లతో రాణించడంతో  20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. 139 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా లెజెండ్స్‌ ఆదిలోనే సచిన్‌(0), సెహ్వాగ్‌(3) వికెట్లను కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన యూవీ(1) కూడా అవుటవడంతో   5 ఓవర్లో 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సంజయ్‌బంగర్‌, కైఫ్‌లు కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. అయితే బంగర్‌, కైఫ్‌లు వెనువెంటనే వెనుదిరగడంతో ఇండియా లెజెండ్స్‌ 5 వికెట్లు కోల్పోయింది. (క్లార్క్‌కు వచ్చిన నష్టం ఏంటో ?)

ఈ దశలో క్రీజలోకి వచ్చిన ఇర్ఫాన్‌ పఠాన్‌ మన్‌ప్రీత్‌ గోని సహాయంతో చెలరేగిపోయాడు. పఠాన్‌ ఇన్నింగ్స్‌లో  6 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. కాగా పఠాన్‌ 31 బంతుల్లోనే 57 పరుగులు చేసి ఇంకా 8 బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు. అంతకుముందు బౌలింగ్‌ వేసిన పఠాన్‌ కీలకమైన తిలకరత్నే దిల్షాన్‌ వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా శనివారం వాంఖేడే స్టేడియం వేదికగా ఇండియా లెజెండ్స్‌- వెస్టిండీస్‌ లెజెండ్స్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సెహ్వాగ్‌ వీర బాదుడుతో ఇండియా లెజెండ్స్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. (ఆ పంచ్‌లకు సచిన్‌ మురిసిపోయాడు!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top