‘చంద్రబాబుపై సీబీఐ విచారణ జరపాలి’ | YSRCP leader merugu nagarjuna fires on chandrababu naidu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబుపై సీబీఐ విచారణ జరపాలి’

Apr 24 2018 11:49 AM | Updated on May 29 2018 4:37 PM

YSRCP leader merugu nagarjuna fires on chandrababu naidu - Sakshi

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  ఎస్సీ సెల్‌ నాయకుడు మేరుగు నాగార్జున విమర్శించారు.

సాక్షి, విశాఖ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  ఎస్సీ సెల్‌ నాయకుడు మేరుగు నాగార్జున విమర్శించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకుని కలుషితం చేస్తున్నారన్నారు. జస్టిస్‌ ఈశ్వరయ్య రాసిన లేఖకు బాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. న్యాయవ్యవస్థను తప్పుదోవ పట్టించిన చంద్రబాబుపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

చంద్రబాబు పాలనలో దళితులకు, గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. దళితులపై దాడులు జరిగితే పట్టించుకోరని మండిపడ్డారు. సబ్‌ప్లాన్‌ ద్వారా ఎంతమంది దళితులు లబ్ధి పొందారని ఆయన ప్రశ్నించారు. గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదన్నారు. మట్టి, ఇసుక, దేవుడి భూములను కూడా వదలడం లేదని ఆరోపించారు. చంద్రబాబు మళ్లీ దళితులను మోసం చేస్తున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement