ముప్పవరం చేరుకున్న జననేత.. ఘన స్వాగతం
సాక్షి, నిడదవోలు : ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అనే భరోసానిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు. వైస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్ జగన్ శనివారం ఉదయం పెరవాలి నుంచి పాదయాత్రను ప్రారంభించారు.
పాదయాత్రలో డి. ముప్పవరం చేరుకున్న జననేతకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. దారిపొడవునా ప్రజలు రాజన్న బిడ్డ నీరాజనాలు పలుకుతున్నారు. ఈ రోజు సాయంత్రం నిడదవోలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. అనంతరం వైఎస్ జగన్ అక్కడే బస చేస్తారు.
సంబంధిత వార్తలు