184వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర | YS Jagan Prajasankalpayatra 184Th Day Starts | Sakshi
Sakshi News home page

184వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

Jun 9 2018 8:35 AM | Updated on Jul 26 2018 7:17 PM

YS Jagan Prajasankalpayatra 184Th Day Starts - Sakshi

సాక్షి, నిడదవోలు : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్‌ జగన్‌ శనివారం ఉదయం పెరవాలి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి మునిపల్లి, పెండ్యాల క్రాస్‌, కల్వచర్ల, డి ముప్పవరం చేరుకుని వైఎస్‌ జగన్‌ భోజన విరామం తీసుకుంటారు.

అనంతరం పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కు ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి సమిశ్ర గూడెం మీదుగా నిడదవోలు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. నిడదవోలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తారు. అనంతరం వైఎస్‌ జగన్‌ అక్కడే బస చేస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement