80 స్థానాల్లో విజయం సాధిస్తాం | We will win 80 seats : BJP | Sakshi
Sakshi News home page

80 స్థానాల్లో విజయం సాధిస్తాం

Jul 3 2018 12:12 PM | Updated on Mar 28 2019 8:37 PM

We will win 80 seats : BJP - Sakshi

మాట్లాడుతున్న బీజేపీ నాయకులు 

మంచిర్యాలసిటీ : తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 80 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డి, జనచైతన్య యాత్ర జిల్లా ప్రముఖ్‌ దుగ్యాల ప్రదీప్‌కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. మంచిర్యాలలో మంగళవారం నిర్వహించనున్న జనచైతన్య యాత్ర, బహిరంగ సభకు సంబంధించి పట్టణంలోని ఆర్‌బీహెచ్‌వీ పాఠశాల మైదానంలో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజీపే పరిపాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. జనచైతన్య యాత్రలో ప్రజల సంక్షేమం కోసం మోదీ ప్రవేశ పెట్టిన 141 సంక్షేమ పథకాలను వివరించనున్నామని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక విధాలుగా మోసం చేసిందని, ఆ మోసాలను ప్రజలకు వివరించి మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

యాత్ర, సభలో కేంద్రమంత్రి హన్స్‌రాజ్‌ గంగరాం, ఎంపీ దత్తాత్రేయ పాల్గొం టారని తెలిపారు. గోనె శ్యాంసుందర్‌రావు, గోళి రామన్న, పెద్దపల్లి పురుషోత్తం, మున్నారాజ్‌ సిసోడ్య, తుల అంజనేయులు, అందుగుల శ్రీనివాస్, ఆరుముళ్ల పోశం, బట్టి కృష్ణ, కర్ణ శ్రీధర్, దేవేందర్, పూసాల వెంకన్న పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement