వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ నాయకులు | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ నాయకులు

Published Wed, Oct 31 2018 11:42 AM

TDP Leaders Join In YSRCP In Chittoor - Sakshi

వడమాలపేట : మండలంలోని ఓబీఆర్‌ కండ్రిగ, రామరాజుకండ్రిగ గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు మంగళవారం నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో పుత్తూరు టౌన్‌ యూత్‌ లీడర్, జిల్లా ప్రభాస్‌ ఫ్యాన్స్‌ సంఘం సభ్యుడు వి.శ్రీనివాసరాజు, డి.ప్రకాష్‌రాజు, నారాయణరాజు ఉన్నారు. వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ, వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కోసం కష్టపడుతున్న తీరు, ఆయన ప్రకటించిన నవరత్నాలు పథకాలపై ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ మురళీధర్‌రెడ్డి, జెడ్పీటీసీ సురేష్‌రాజు, కన్వీనర్‌ సదాశివయ్య, నాయకులు మహేష్‌రెడ్డి, రమేష్, గోపి, చెంగల్‌రాజు, మోహన్‌రాజు, శివరా జు, తులసీరామరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement