
సాక్షి, తెనాలి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. ఆదివారం ఉదయం వైఎస్ జగన్ పాదయాత్రను తెనాలి శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి కఠెవరం, సోమసుందరపాలెం క్రాస్ మీదుగా పాదయాత్ర కంచర్లపాలెంకు చేరుకుంటుంది. మధ్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు.
అనంతరం పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.30కు ప్రారంభమౌతుంది. జాషువా నగర్, నందివెలుగు, కొలకలూరు క్రాస్, చింతలపూడి, దుగ్గిరాల మీదుగా మంచికలపూడి వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రికి వైఎస్ జగన్ అక్కడే బస చేస్తారు. దారిపొడవునా రాజన్న బిడ్డకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు.