ప్రజాసంకల్పయాత్ర 131వ రోజు షెడ్యూల్‌

YS Jagan Prajasankalpayatra 0131 day Schedule Released - Sakshi

సాక్షి, తెనాలి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ పాదయాత్రలో రాజన్న  బిడ్డ ముందుకు సాగుతున్నారు. ప్రజాసంకల్పయాత్ర 131వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పాదయాత్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు.

ఆదివారం ఉదయం వైఎస్‌ జగన్‌ తెనాలి పురవేదిక సెంటర్‌ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కఠెవరం, సోమ సుందరం పాలెం క్రాస్‌, కంచర్ల పాలెంకు పాదయాత్ర చేరుకుంటుంది. అక్కడ రాజన్న బిడ్డ జనంతో మమేకం కానున్నారు. అనంతరం జాస్వా నగర్‌, నంది వెలుగు మీదుగా కొలకలూరు క్రాస్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2.45 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రాంభమౌతుంది. చింతలపూడి, దుగ్గిరాల మీదుగా మంచీకల పూడి వరకు పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రి వైఎస్‌ జగన్‌ అక్కడే బస చేస్తారు. దారిపొడవునా రాజన్న బిడ్డకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top