నాకు జ్యోతిషం తెలియదు | kavitha about kcr | Sakshi
Sakshi News home page

నాకు జ్యోతిషం తెలియదు

Jan 31 2018 2:18 AM | Updated on Aug 15 2018 8:12 PM

kavitha about kcr  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వారసులెవరో చెప్పడానికి తనకు జ్యోతిషం తెలియదని, అది భవిష్యత్తులో తేలుతుందని నిజామాబాద్‌ ఎంపీ కవిత వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 100 సీట్లు ఖాయం అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తాను ఎంపీగా పోటీచేయాలా ఎమ్మెల్యేగానా అన్నది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. మంత్రి హరీశ్‌రావు ఎంపీగా పోటీ చేస్తారా అన్న దానిపై తాను స్పందించనన్నారు. మంగళవారం సచివాయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్‌ నుంచి చాలామంది టీఆర్‌ఎస్‌లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని, వలసలతో ఇబ్బంది లేదని, తమకు అవసరం లేనిచోట తీసుకోవటం లేదన్నారు. టీటీడీపీని టీఆర్‌ఎస్‌తో విలీనం చేయాలన్న మోత్కుపల్లి నర్సింహులు ప్రతిపాదనను తాము స్వాగతిస్తున్నామన్నారు. కోదండరాం రాజకీయ పార్టీ పెడితే స్వాగతిస్తామన్నారు. పవన్‌కల్యాణ్‌కు పోటీచేసే హక్కు ఉందని, దానిపై ప్రజలే నిర్ణయిస్తారన్నారు. రాష్ట్ర కేబినెట్‌లో మార్పులు ఉండవని, మహిళలకు మంత్రి పదవి లేదనేది చిన్న విషయమని, రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement