‘అప్పుల్లో కూడా స్కాం చేసిన ఘనత ఆయనదే’ | GVL Narasimha Rao Fire On Chandrababu Over IT Raids | Sakshi
Sakshi News home page

Oct 5 2018 6:01 PM | Updated on Oct 5 2018 6:57 PM

GVL Narasimha Rao Fire On Chandrababu Over IT Raids - Sakshi

జీవిఎల్‌ నరసింహారావు (ఫైల్‌ ఫోటో)

సాక్షి, విజయవాడ: రాష్ట్రానికి చేసిన అప్పుల్లో కూడా స్కాం చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడికే దక్కుతుందని బీజేపీ నేత జీవిఎల్‌ నరసింహారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఐటీ దాడులను కూడా రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకోవాలిన టీడీపీ అధినేత భావిస్తున్నాడని ఎద్దేవ చేశారు. శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవిఎల్‌ మాట్లాడారు. ఏపీలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. అవినీతిపై దాడులు జరిగితే రాష్ట్రానికి అప్రతిష్టపాలు ఎలా అవుతుందని ప్రశ్నించారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని స్పష్టం చేశారు. తాము అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దుర్మార్గపు, చేతకాని వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు.


చదవండి: 

మాకు పట్టిన శని కాంగ్రెస్‌కు తగులుకుంది

చంద్రబాబుకు భయమెందుకు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement