హైదరాబాద్: చట్టసభల్లోనే కాదు బహిరంగ సభల్లో కూడా నిద్రపోయే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీయేనని తెలంగాణ బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ..రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన అంతా డొల్లతనం, అవగాహనా రాహిత్యం, కుర్రతనమే కనిపించిందని అన్నారు. రాహుల్ గాంధీ పగటి కలలు కనే వ్యక్తి అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అయిందని, బీజేపీని ఎదుర్కొనే సత్తా లేకే చిల్లర ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. దేశంలో పంచభూతాలను అవినీతిమయం చేసి కుంభకోణాలు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని తూర్పారబట్టారు. మోదీ స్థాయి రాహుల్కు లేదని..నీకు మేము చాలు అని వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ కుటుంబ పాలన మీద మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ నిలబడిందే కుటుంబ పాలన మీద అని ఘాటుగా విమర్శించారు. ఒక నాణానికి రెండు వైపులా ఉంది కాంగ్రెస్, టీఆర్ఎస్లేనని వ్యాఖ్యానించారు. స్వామి పరిపూర్ణానందను అకారణంగా నగర బహిష్కరణ చేశారని, ఆయనకు బహిరంగ క్షమాపణ చెప్పి హైదరాబాద్కు తీసుకురావాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.10 కోట్ల కుటుంబాలకు ఉపయోగపడే ఆయుష్మాన్భవ కార్యక్రమంపై మోదీ ఆగస్టు 15న ప్రకటన చేయడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణాలో ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్వీర్యం అయింది...ఈ తరుణంలో కేంద్రం ఈ ప్రకటన చేయడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు ఈ పథకం బాగా ఉపయోగపడుతుందని తెలిపారు.
బహిరంగసభలో కూడా నిద్రపోయే వ్యక్తి ఆయనే
Published Wed, Aug 15 2018 6:20 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement