200వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ | 200th Day PrajaSankalpaYatra Scheduele Released | Sakshi
Sakshi News home page

200వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

Jun 26 2018 8:21 PM | Updated on Jul 26 2018 7:17 PM

200th Day PrajaSankalpaYatra Scheduele Released - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అలుపెరుగని మోముతో రాష్ట్ర ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర బుధవారంతో 200 రోజులు పూర్తి చేసుకోనుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అరాచక పాలనను ఎండగడుతూ, ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్సార్‌ కడప జిల్లా ఇడుపులపాయ నుంచి గతేడాది నవంబర్‌ 6న వైఎస్‌ జగన్‌ పాదయాత్రను ప్రారంభించారు.

200 రోజుల పాటు 2400 కిలోమీటర్లలకుపైగా పాదయాత్ర చేస్తూ.. ప్రజల కష్టాలు వింటూ, వారి కన్నీళ్లను తుడుస్తూ, ఆత్మీయంగా స్పృశిస్తూ, పలకరిస్తూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు. బుధవారం ఆయన అమలాపురం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కామనగరువు, అప్పన్నపేట, విలాసవిల్లిల మీదుగా వాసంశెట్టివారి పాలెంకు చేరుకుంటారు. అనంతరం భీమనపల్లి చేరుకుని అక్కడ యాత్ర ముగిస్తారు. ఈ మేరకు పార్టీ జనరల్‌ సెక్రటరీ తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement