తప్పిపోయిన పిల్లల కోసం వెబ్‌సైట్ | Website for missing children | Sakshi
Sakshi News home page

తప్పిపోయిన పిల్లల కోసం వెబ్‌సైట్

Jun 3 2015 1:06 AM | Updated on Sep 3 2017 3:07 AM

తప్పిపోయిన పిల్లల కోసం వెబ్‌సైట్

తప్పిపోయిన పిల్లల కోసం వెబ్‌సైట్

దేశవ్యాప్తంగా తప్పిపోయిన పిల్లల కోసం కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంగళవారం ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తప్పిపోయిన పిల్లల కోసం కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంగళవారం ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్, శిశుసంక్షేమ మంత్రి మేనకాగాంధీ సంయుక్తంగా ‘‘ఖోయా-పాయా’’ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. పౌరులు తమకు ఎవరైనా తప్పిపోయిన పిల్లలు కనిపించినా, అనుమానాస్పద వ్యక్తులతో పిల్లలు కనిపించినా ఈ వెబ్‌సైట్ ద్వారా తెలపొచ్చు.

ట్రాక్ చైల్డ్ పేరుతో ఇప్పటికే వెబ్‌సైట్ ఉన్నా అది పోలీసులకు ఉద్దేశించిందని, ఈ కొత్త వెబ్‌సైట్‌లో ప్రజలు ప్రత్యక్షంగా భాగస్వాములు కావచ్చని.. సమాచారాన్ని అప్‌లోడ్ చేయవచ్చని మేనకాగాంధీ తెలిపారు. జాతీయ నేర రికార్డుల బ్యూరో లెక్కల ప్రకారం ఏడాదికి సగటున 70 వేల మంది పిల్లలు అదృశ్యమవుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement