ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి

Two Maoists killed during combing in Odisha - Sakshi

భువనేశ్వర్‌:
ఒడిశాలోని భార్గర్‌ జిల్లా పైక్మాల్‌ సెలమాలిలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. అటవీప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న బలగాలకు మావోయిస్టులు తారసపడటంతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళ మావోయిస్టులు మృతిచెందారు.

సంఘటనా స్థలం నుంచి రెండు తుపాకులు, భారీగా తూటాలు, మావోయిస్టులు వాడే నిత్యావసర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top