అ‍మూల్‌ డైర్ ట్వీటర్‌ ఖాతా నిలిపివేత, కారణం అదే

Twitter Temporarily Deactivates Amul Dairy Account - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్‌ డైరీ ఖాతను మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్ ‌తాత్కలికంగా నిలిపివేసింది. ఇండియా - చైనా మధ్య సరిహద్దు విషయంలో గత కొన్ని రోజులుగా విభేదాలు తలెత్తుతున్న నేపథ్యంలో చైనా ఉత్పత్తులను దేశంలో నిషేధించాలనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ క్రమంలోనే భారతీయ ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్‌ డైరీ ‘ఎగ్జిట్‌ ది డ్రాగన్’‌ అంటూ ఒక పోస్టర్‌ను తన ట్విటర్‌ ఖాతలో షేర్‌ చేసింది. ఈ పోస్టర్‌లో అమూల్‌ బేబీ చైనా చిహ్నం డ్రాగన్‌ను చేతితో ఆపుతున్నట్లు ఉంది. అదేవిధంగా ఈ పోస్టర్‌లో చైనా యాప్‌ టిక్‌టాక్‌ కనిపిస్తుండటం ఉండటం విశేషం. దీంతో ట్విటర్‌ అమూల్‌ అకౌంట్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ విషయాన్ని అమ్యూల్‌ సంస్థ ధృవీకరించింది. (అంగుళం భూమి వదులుకోం.. క్షమించం: చైనా)

ఎగ్జిట్‌ డ్రాగన్‌ పోస్ట్‌ కారణంగా తమ ఎకౌంట్‌ను  తాత్కలికంగా తొలగించిందని తెలిపింది. అయితే దీనికి సంబంధించి ట్విటర్‌ తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని అమ్యూల్‌ సంస్థ పేర్కొంది. తాము అన్ని విషయాల మీద స్పందిస్తామని, పక్షపాత ధోరణితో ఏ విషయంలో వ్యవహరించమని అమ్యూల్‌ సంస్థ తెలిపింది. అకౌంట్‌ను తిరిగి పునరుద్దరించాలని ట్విటర్ను కోరినట్లు తెలిపింది. తమ అకౌంట్‌ను తొలగించిన కారణంగా ఈ పోస్ట్‌ తమ ఫాలోవర్స్‌ ఎవరికి కనిపించడం లేదని సంస్థ తెలిపింది. అందరూ అమూల్‌ సంస్థకు అండగా నిలుస్తున్నారని, ట్విటర్‌ ఇలా చేయడంతో వారు అందరూ ఎంతో బాధపడుతున్నారని పేర్కొంది. ఈ విషయంపై ట్విటర్‌ను వివరణ కోరామని కూడా అమూల్‌ సంస్థ తెలిపింది. దీనిపై స్పందించిన ట్విటర్ అమూల్‌ సంస్థ రక్షణ కోసమే ఇలా చేశామని, ట్విటర్లో పబ్లిష్‌ చేసిన విషయంతో దీనికి సంబంధం లేదని తెలిపింది. ఇండియా- చైనా సరిహద్దు వివాదం, మహమ్మారి కరోనా వ్యాప్తికి చైనానే కారణం అని చాలా మంది భావిస్తుండటంతో చైనా ఉత్పత్తులను భారత్‌లో నిషేధించాలనే వాదన బలంగా వినిపిస్తోంది. 

(రిమూవ్ చైనా యాప్స్కు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top