మంచినీళ్లు అడిగితే మూత్రం తాగించారు..

Tribes Made To Drink Urine In Police Custody In Madhya Pradesh - Sakshi

మధ్యప్రదేశ్‌లోని పోలీస్‌ స్టేషన్‌లో ఘటన

భోపాల్‌: పోలీసుల కస్టడీలో ఉన్న గిరిజన నిందితుల చేత మూత్రం తాగించిన స్టేషన్‌ సిబ్బంది తీవ్ర అవమానకరమైన చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్‌ జిల్లాలోని నన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నన్‌పూర్‌కు చెందిన ఐదుగురు గిరిజన యువకులను ఓ నేరం కింద అరెస్ట్‌చేసిన పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించారు. కస్టడీలో ఉన్న వారిపై ఖాకీలు లాఠీ ఝుళిపించి.. చితకబాదారు. తీవ్ర గాయలపాలైన యువకులు తాగడానికి మంచినీళ్లు ఇవ్వాల్సిందిగా పోలీసులను వేడుకున్నారు. అయినా కనుకరించని స్టేషన్‌​ సిబ్బంది వారి చేత మూత్రం తాగించి తీవ్ర అవమానానికి గురిచేశారు.

ఘటనపై స్పందించిన స్థానిక ఎస్పీ విపుల్‌ శ్రీవాస్తవ.. ఈ చర్యకు పాల్పడ్డ నలుగురు స్టేషన్‌ సిబ్బందిని విధుల నుంచి సస్పెండ్‌ చేసినట్లు వివరించారు. దీనిపై మరింత విచారణ జరిపి చట్టపరమమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. గాయపడ్డ ఐదుగురు గిరిజన యువకులకు స్థానిక ఆసుపత్రిలో వైద్య చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top