కొరకబోయిన ప్రయాణికుడిని సీటుకు కట్టేశారు!

కొరకబోయిన ప్రయాణికుడిని సీటుకు కట్టేశారు! - Sakshi


బాగా పూటుగా తాగేసి.. విమాన సిబ్బందిపై అరవడమే కాక, తోటి ప్రయాణికుడిని కొరకడానికి ప్రయత్నించిన ఓ ప్రబుద్ధుడిని విమాన సిబ్బంది అతడి సీటుకు కట్టేశారు. మెల్బోర్న్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఎయిరిండియా విమానంలో ఈ సంఘటన జరిగింది. అతడిని అలా 12 గంటల పాటు సీటుకు కట్టేసే ఉంచారు. మద్యం తాగిన 27 ఏళ్ల ప్రయాణికుడు ముందుగా సిబ్బంది మీద అరవడం మొదలుపెట్టాడు. ఇద్దరు సిబ్బంది దుస్తులు కూడా చించేశాడు. ఆ తర్వాత ఇతర ప్రయాణికులను కొరకడానికి ప్రయత్నించాడు.



దాంతో మిగిలిన ప్రయాణికుల సాయంతో సిబ్బంది అతడిని పట్టుకుని తాళ్లు, వైర్లతో అతడి సీటుకు కట్టేశారు. ఇతర ప్రయాణికుల భద్రత కోసం విమానాన్ని దారిమళ్లించి సింగపూర్లో ఆపమంటారా అని కూడా పైలట్ ఢిల్లీలోని ఎయిరిండియా ప్రధాన కార్యాలయాన్ని అడిగాడు. అయితే ఆలస్యం అవుతుందని వాళ్లు వద్దన్నారు. విమానం ఢిల్లీలో దిగగానే తాగుబోతు ప్రయాణికుడిని అరెస్టు చేసి, అతడిమీద కేసు నమోదు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top