సెలెక్ట్‌ కమిటీకి ‘డేటా’ బిల్లు | Lok Sabha refers data protection bill to joint panel of Parliament | Sakshi
Sakshi News home page

సెలెక్ట్‌ కమిటీకి ‘డేటా’ బిల్లు

Dec 12 2019 2:17 AM | Updated on Dec 12 2019 2:17 AM

Lok Sabha refers data protection bill to joint panel of Parliament - Sakshi

న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో.. పౌరుల సమాచార భద్రతకు ఉద్దేశించిన ‘వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు’పై (పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లు) కేంద్రప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఈ బిల్లును జాయింట్‌ సెలెక్ట్‌ ప్యానల్‌ పరిశీలనకు పంపిస్తున్నట్లు ఐటీ మంత్రి రవి శంకర్‌ చెప్పారు. ఈ కమిటీ బిల్లుకు సంబంధించిన నివేదికను  బడ్జెట్‌ సమావేశాల్లోపు అందించనున్నట్లు తెలుస్తోంది. కాగా, సమాచార భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు అభ్యంతరాలు లేవనెత్తడం తెల్సిందే.  ఈ బిల్లును స్టాండింగ్‌ కమిటీ పరిశీలనకు పంపాలని కోరారు. ఆందోళనల నేపథ్యంలో బిల్లును కమిటీ పరిశీలనకు పంపారు. కమిటీలో ఎంపీలు మిథున్‌రెడ్డి, మీనాక్షి లేఖి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement