సిద్ధారూఢ మఠంలో కాజోల్‌ పూజలు | Sakshi
Sakshi News home page

సిద్ధారూఢ మఠంలో కాజోల్‌ పూజలు

Published Fri, Dec 1 2017 11:58 AM

Kajol In Sidharuda Matam Karnataka - Sakshi

సాక్షి, బళ్లారి: కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతున్న సిద్ధారూఢ మఠాన్ని బాలీవుడ్‌  నటి కాజోల్‌ సందర్శించారు. ఆమె గురువారం ప్రత్యేక విమానంలో హుబ్బళ్లికి విచ్చేశారు. హుబ్బళ్లిలోని సిద్ధారూఢ మఠంలో కుటుంబ సభ్యులతో కలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్ధారూఢ సమాధిని దర్శించుకున్న అనంతరం ధ్యానం చేశారు. తల్లి తనూజా ముఖర్జీ, కుమారుడు యోగి, సోదరి తనీషా, కుటుంబ సభ్యులు అభిషేకం చేశారు. చిన్నప్పటి నుంచి ఆమె సిద్ధారూఢ భక్తురాలు కావడం విశేషం.

సమాధికి హారతిస్తున్న కాజోల్, కుటుంబసభ్యులు

Advertisement

తప్పక చదవండి

Advertisement