*ఆర్థిక వృద్ధి రేటు టార్గెట్ 7 శాతం
*ఆరోగ్య, విద్యా రంగాలపై పెట్టుబడులు
*వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత
*ఆర్థిక సర్వే విడుదల
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక వృద్ధి రేటు తక్కువలోతక్కువ జాతీయ స్థూల ఉత్పత్తిలో 7 నుంచి 7.75 శాతం మధ్య ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. మరిన్ని ఆర్థిక సంస్కరణలు తీసుకరావాలని, పన్నుల పరిధిని విస్తరించి, పన్నులపై ఇస్తున్న రాయతీలను ఎత్తివేయాలని సూచించింది. అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు ద్య్రవ్య స్థిరీకరణ టైమ్ టేబుల్ పాటించాలని సూచించింది. వీలైనంత త్వరగా వస్తు సేవల పన్నును అమల్లోకి తీసుకరావాలని అభిప్రాయపడింది. ఏడవ వేతన సంఘం సిఫార్సులను అమలు చేయడం ఆర్థిక వ్యవస్థను పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని, ఇతరేతర మార్గాల ద్వారా ఈ మేరకు ఆర్థిక వనరులను సమీకరించవచ్చని కూడా అభిప్రాయపడింది.
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేంద్ర జనరల్ బడ్జెట్ను సమర్పించడానికి మూడు రోజులు ముందుగా శుక్రవారం నాడు పార్లమెంట్కు ఆర్థిక నివేదికను సమర్పించారు. 2016-17 సంవత్సరానికి కనిష్టంగా 7 నుంచి 7.75 శాతం వృద్ధి రేటు సాధిస్తామని, వృద్ధి రేటును 8 నుంచి 10 శాతం రేంజ్కు తీసుకెళ్లాలంటే మరి కొన్ని సంవత్సరాలు నిరీక్షించాల్సిందేనని ఆర్థిక నివేదిక వెల్లడించింది. గతేడాది ఆర్థిక సంవత్సరానికి 8.1 నుంచి 8.5 శాతం రేంజ్కు వస్తుందని అంచనా వేయగా, 7.6 శాతం వద్దనే ఆర్థిక వృద్ధి రేటు ఆగిపోయింది.
జాతీయ స్థూల ఉత్పత్తిలో ద్రవ్యలోటు 4.5-5 శాతానికి పడిపోతుందని ఆర్థిక నివేదిక ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ద్రవ్యలోటు 1-1.5 శాతం మధ్య ఉండడం వల్ల ధరలు స్థిరంగా ఉన్నాయని అభిప్రాయపడింది. అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పడిపోవడంతో ద్రవ్యలోటు ప్రధానంగా తగ్గింది. రూపాయి విదేశీ మారక విలువ సముచితంగా కొనసాగించాలని నివేదిక సూచించింది. రూపాయి మరింత బలపడక పోయినా ఆర్థిక సరళీకరణ ద్వారా సముచిత స్థాయిలో రూపాయి విలువను సముచిత స్థాయిలో కొనసాగించవచ్చని అభిప్రాయపడింది. పెట్టుబడుల రాక తగ్గినప్పుడు లేదా బలహీనంగా ఉన్నప్పుడు కొంత మేరకు రూపాయి మారక విలువ తగ్గింపును అనుమతించవచ్చని సూచించింది. చైనా తరహాలో ఆసియాలో కరెన్సీ సర్దుబాట్లను చేసుకోవచ్చని చెప్పింది.
పన్నుల పరిధిని 5.5 శాతం నుంచి 20 శాతానికిపైగా విస్తరించాలని, పన్ను రాయతీలను సమీక్షించి క్రమేణా ఎత్తివేయాలని నివేదిక సూచించింది. 2018-19 నాటికి బ్యాంకులకు పెట్టుబడుల అవసరం 1.8 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అభిప్రాయపడింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా భారత ఆర్థిక పరిస్థితి స్థిరంగా, ప్రపంచంకన్నా బలంగా ఉందని వ్యాఖ్యానించింది. మార్కెట్ వ్యతిరేక విధానాల జోలికి వెళ్లవద్దని, ఆరోగ్య, విద్యా రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయపడింది.
పార్లమెంట్లో జైట్లీ ఆర్థిక సర్వే నివేదిక
Published Fri, Feb 26 2016 7:27 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
Advertisement