
ఆ హీరోతో ఈ ఇద్దరూ... !
త్రిష, నయనతార .... ఈ ఇద్దరూ నాలుగైదేళ్ల క్రితం పోటాపోటీగా సినిమాలు చేసేవారు. వృత్తిపరమైన పోటీ కారణంగా....
త్రిష, నయనతార .... ఈ ఇద్దరూ నాలుగైదేళ్ల క్రితం పోటాపోటీగా సినిమాలు చేసేవారు. వృత్తిపరమైన పోటీ కారణంగా ఈ ఇద్దరి మధ్యా స్నేహం ఉండేది కాదు. చాలాకాలం కోల్డ్వార్ నడిచినా, ఆ తర్వాత మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఇప్పుడు ఇద్దరూ ఒకే సినిమాలో కనిపించనున్నారని టాక్. ‘నానుమ్ రౌడీదాన్’ (తెలుగులో ‘నేను రౌడీనే’) ఫేమ్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘పిజ్జా’ ఫేం విజయ్ సేతుపతి హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. ప్రముఖ నిర్మాత ఏయం రత్నం ఈ సినిమా నిర్మించనున్నారు. ఇందులో కథానాయికలుగా నయనతార, త్రిషలను తీసుకోవాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారట. త్రిష, నయన ఈ చిత్రంలో నటించడానికి సుముఖంగా ఉన్నారని భోగట్టా.