నేటి మరదలు... రేపటి పోలీస్ ఆఫీసర్! | Anasuya Bharadwaj to turn tough cop for 'Kshanam' | Sakshi
Sakshi News home page

నేటి మరదలు... రేపటి పోలీస్ ఆఫీసర్!

Jan 21 2016 10:49 PM | Updated on Jul 15 2019 9:21 PM

నేటి మరదలు... రేపటి పోలీస్ ఆఫీసర్! - Sakshi

నేటి మరదలు... రేపటి పోలీస్ ఆఫీసర్!

బుల్లితెరపై బోల్డంత పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ వెండితెరపై కూడా విజృంభించాలని ఫిక్స్ అయ్యారు.

బుల్లితెరపై బోల్డంత పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ వెండితెరపై కూడా విజృంభించాలని ఫిక్స్ అయ్యారు. ఇటీవల సంక్రాంతికి విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంలో నాగార్జున మరదలి పాత్రలో మెరిసి, భేష్ అనిపించుకున్న అనసూయ ఇప్పుడు ఓ యాక్షన్ రోల్‌లో కనిపించనున్నారు. నటుడు అడివి శేష్ దర్శకత్వంలో పొట్లూరి వి. ప్రసాద్ నిర్మించిన ‘క్షణం’ చిత్రంలో ఆమె పోలీసాఫీసర్ పాత్ర చేశారు. ఇది ఫుల్ లెంగ్త్ రోల్. ఈ చిత్రంలో ఆదా శర్మ, అడివి శేష్ కూడా నటించారు. ఒక పాప, బాబు చుట్టూ తిరిగే చిత్ర కథ ఇది. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement