ఛాలెంజ్గా తీసుకోవాలని వైఎస్ జగన్ చెప్పారు | ysrcp to face ap municipal polls as challenge, says kannababu | Sakshi
Sakshi News home page

ఛాలెంజ్గా తీసుకోవాలని వైఎస్ జగన్ చెప్పారు

Sep 6 2016 5:41 PM | Updated on Mar 23 2019 9:03 PM

ఛాలెంజ్గా తీసుకోవాలని వైఎస్ జగన్ చెప్పారు - Sakshi

ఛాలెంజ్గా తీసుకోవాలని వైఎస్ జగన్ చెప్పారు

మున్సిపల్ ఎన్నికలను ఛాలెంజ్గా తీసుకోవాలని వైఎస్ జగన్ సూచించారని ఆ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కన్నబాబు చెప్పారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో 9 జిల్లాల్లో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను ఛాలెంజ్గా తీసుకోవాలని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారని ఆ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కన్నబాబు చెప్పారు. ఎన్నికలకు ఇప్పటినుంచే పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని, పార్టీ కేడర్ అంతా టీమ్ వర్క్గా పనిచేయాలని వైఎస్ జగన్ చెప్పారని కన్నబాబు తెలిపారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఇంచార్జ్లను నియమించినట్టు చెప్పారు.

ఈ నెల 11న వైఎస్ఆర్ సీపీ మున్సిపల్ ఎన్నికల కార్యక్రమాలను ప్రారంభిస్తుందని కన్నబాబు తెలిపారు. సేవా ధృక్పథం, మంచిపేరు, విధేయత కలిగినవారికే అభ్యర్థులుగా ప్రాధాన్యమివ్వాలని వైఎస్ జగన్ చెప్పారని వెల్లడించారు. గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం యధావిథిగా కొనసాగుతుందని, కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల తొలగింపుపై ప్రత్యేక దృష్టిసారించనున్నట్టు కన్నబాబు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement