కూకట్‌పల్లిలో రెచ్చిపోయిన దొంగలు | Thieves hulchal in kukatpally | Sakshi
Sakshi News home page

కూకట్‌పల్లిలో రెచ్చిపోయిన దొంగలు

Jun 28 2016 11:54 AM | Updated on Aug 30 2018 5:27 PM

కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగలు మరోసారి తెగబడ్డారు.

హైదరాబాద్: కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగలు మరోసారి తెగబడ్డారు. సోమవారం రాత్రి ఆరో ఫేజ్‌లో ఉన్న సత్యసాయి సదన్ అపార్టుమెంట్‌లోని ఫ్లాట్ నంబర్ 202, లక్ష్మీ రెసిడెన్సీలోని 404, 401, 202 ఫ్లాట్‌ల్లో తాళాలు పగులగొట్టి దొంగతనానికి యత్నించారు. అలాగే, జగన్‌మోహన్ అపార్టుమెంట్, దివ్య ఎమరాల్డ్‌ల్లో కూడా ప్రవేశించారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లనే దొంగలు టార్గెట్ చేసుకున్నారు. బాధితులు స్థానికంగా లేనందున చోరీకి గురైన సొత్తు వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటన స్థలాలను పరిశీలించి, వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement