ఏపీలోని రాజమండ్రి పుష్కరఘాట్లో మంగళవారం జరిగిన తొక్కిసలాటలో 27 మంది భక్తులు మృతి చెందడం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్రావు తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు.
హైదరాబాద్ : ఏపీలోని రాజమండ్రి పుష్కరఘాట్లో మంగళవారం జరిగిన తొక్కిసలాటలో 27 మంది భక్తులు మృతి చెందడం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్రావు తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గోదావరి మహా పుష్కరాలు సజావుగా జరిగేలా ఆశీర్వదించాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్టు ఆయన తెలిపారు.