వేధింపులకు మహిళా సాప్ట్వేర్ ఇంజినీర్ బలి | software engineer swetha commits Suicide in secunderabad | Sakshi
Sakshi News home page

వేధింపులకు మహిళా సాప్ట్వేర్ ఇంజినీర్ బలి

Oct 16 2016 2:18 PM | Updated on Oct 22 2018 7:50 PM

వేధింపులకు మహిళా సాప్ట్వేర్ ఇంజినీర్ బలి - Sakshi

వేధింపులకు మహిళా సాప్ట్వేర్ ఇంజినీర్ బలి

అత్తింటి వేధింపులకు ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ బలైంది.

హైదరాబాద్ : అత్తింటి వేధింపులకు ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ బలైంది. సికింద్రాబాద్ నల్లగుట్టలో సాప్ట్వేర్ ఇంజినీర్ శ్వేత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. కాగా శ్వేత ఆత్మహత్య చేసుకుందని అత్తింటి వారు చెబుతుండగా, భర్త శ్రీకాంత్, అత్తమామలే తమ బిడ్డను హతమార్చారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లి అయిన కొద్దిరోజుల నుంచే శ్వేతను భర్త వేధింపులకు గురి చేస్తున్నట్లు వారు తెలిపారు.

శ్వేతను ఉద్యోగం మానేని రాజకీయాల్లోకి రావాలని శ్రీకాంత్ వేధించేవాడని, ఈ సందర్భంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఉద్యోగం వదిలేసి రాజకీయాల్లోకి శ్వేత అంగీకరించకపోవటంతో తరచు భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగేదని స్థానికులు చెబుతున్నారు. గత రాత్రి మద్యం సేవించి వచ్చిన శ్రీకాంత్... ఇదే విషయంపై భార్యతో గొడవ పడనట్లు తెలుస్తోంది.

తెల్లారి లేచి చూసేసరికి శ్వేత ఉరి వేసుకున్నట్లు చెబుతున్నారని మృతురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్గా టికెట్ కోసం శ్రీకాంత్ ప్రయత్నించినట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు... పోస్ట్మార్టం నిమిత్తం శ్వేత మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement