'ఏ క్షణంలోనైనా స్టేట్ మెంట్ ఇస్తారు' | our govt ready to statement on special status, says yanamala ramakrishnudu | Sakshi
Sakshi News home page

'ఏ క్షణంలోనైనా స్టేట్ మెంట్ ఇస్తారు'

Aug 31 2015 8:49 AM | Updated on Mar 23 2019 9:10 PM

'ఏ క్షణంలోనైనా స్టేట్ మెంట్ ఇస్తారు' - Sakshi

'ఏ క్షణంలోనైనా స్టేట్ మెంట్ ఇస్తారు'

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై శాసనసభలో ప్రకటన చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై శాసనసభలో ప్రకటన చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. స్పీకర్ అనుమతిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ క్షణంలోనైనా ప్రత్యేక హోదాపై స్టేట్ మెంట్ ఇస్తారని చెప్పారు. ప్రత్యేక హోదాపై చర్చించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు.

మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదాపై శాసనసభలో చర్చించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. ప్రత్యేక హోదాపైనే ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని వైఎస్సార్ సీపీ ప్రకటించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే అంశంపై ప్రభుత్వాన్ని కదిలించేలా ఒత్తిడి తేస్తామని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement