టీఆర్‌ఎస్‌పై పోరాడేశక్తి బీజేపీకే ఉంది: నాగం | Nagam Janardhan Reddy comments on TRS | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌పై పోరాడేశక్తి బీజేపీకే ఉంది: నాగం

Jun 21 2016 3:08 AM | Updated on Mar 29 2019 9:31 PM

టీఆర్‌ఎస్‌పై పోరాడేశక్తి బీజేపీకే ఉంది: నాగం - Sakshi

టీఆర్‌ఎస్‌పై పోరాడేశక్తి బీజేపీకే ఉంది: నాగం

రాష్ట్రంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్న టీఆర్‌ఎస్‌పై పోరాటం చేసే శక్తి ఒక్క బీజేపీకే ఉందని ఆ పార్టీ నేత నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్న టీఆర్‌ఎస్‌పై పోరాటం చేసే శక్తి ఒక్క బీజేపీకే ఉందని ఆ పార్టీ నేత నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తీవ్ర కరువు పరిస్థితుల నుంచి ఆదుకోవడానికి కేంద్రం నిధులు విడుదల చేస్తే, ఖర్చు చేయలేని అసహాయ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. కేంద్రం ఇస్తున్న నిధులను, పథకాలను ప్రచారం చేయకుండా టీఆర్‌ఎస్ గొప్పలు చెప్పుకుంటోందన్నారు.

కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని తక్కువ చేసి చూపించేవిధంగా ఎంపీ కవిత మాట్లాడటం మంచిది కాదని నాగం హెచ్చరించారు.  రెండేళ్లపాటు మాయమాటలు, అబద్ధాలు చెప్పడం తప్ప ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. ఇప్పటిదాకా రూ.80 వేలకోట్ల పనులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం టెండర్లు పిలిస్తే రూ.70 వేల కోట్ల పనులను ఆంధ్రా కాంట్రాక్టర్లకు కట్టబెట్టిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement