'ప్రజలు ఎటు ఉంటే నాయకులు అటు వెళతారు' | ktr comments on leaders switching parties | Sakshi
Sakshi News home page

'ప్రజలు ఎటు ఉంటే నాయకులు అటు వెళతారు'

Dec 14 2015 6:43 PM | Updated on Aug 15 2018 2:20 PM

మదనపల్లె సబ్రిజిస్ట్రార్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు.

హైదరాబాద్: ప్రజలు ఎంటు ఉంటే నాయకులు అటువైపు వెళతారని తెలంగాణ రాష్ట్ర  ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. ఇటీవల టీఆర్ఎస్ పార్టీలోకి వివిధ పార్టీ నేతల వలసలు పెరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. సోమవారం వివిధ పార్టీల నేతలు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 'తెలంగాణ ఏర్పడ్డాక ప్రధాని నరేంద్రమోదీ ఇటు వైపే రాలేదు. ఇక్కడి ప్రజలకు ప్రధాని ఎలా ఉంటారో తెలియదు' అన్నారు. జాతీయ పార్టీలకు కాలం చెల్లిందన్న ఆయన భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదే అని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే హక్కు చంద్రబాబు, జానారెడ్డిలకు లేదని కేటీఆర్ విమర్శించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement