అన్ని రాష్ట్రాలకు ఆదర్శం | Ideal for all states | Sakshi
Sakshi News home page

అన్ని రాష్ట్రాలకు ఆదర్శం

Apr 9 2016 3:28 AM | Updated on Oct 20 2018 5:49 PM

అన్ని రాష్ట్రాలకు ఆదర్శం - Sakshi

అన్ని రాష్ట్రాలకు ఆదర్శం

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలపై హైదరాబాద్‌లో ఈ నెల 12న సదస్సు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించడంపై నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు.

మిషన్ కాకతీయ, భగీరథ పథకాలపై హరీశ్‌రావు

 సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలపై హైదరాబాద్‌లో ఈ నెల 12న సదస్సు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించడంపై నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకాలను ఆదర్శంగా తీసుకుని అమలు చేయాలని నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఈ పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమాలను నీతిఆయోగ్, కేంద్రం పలుమార్లు కొనియాడాయని తెలిపారు. మిషన్ కాకతీయను అన్ని రాష్ట్రాలు నమూనాగా తీసుకోవడానికి కేంద్రం చర్యలు చేపట్టడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement