వరంగల్ జిల్లా నేతలతో దిగ్విజయ్ భేటీ | digvijaya singh meeting with warangal congress leaders at gandhi bhavan | Sakshi
Sakshi News home page

వరంగల్ జిల్లా నేతలతో దిగ్విజయ్ భేటీ

Oct 29 2015 1:19 PM | Updated on Sep 3 2017 11:41 AM

వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల బరిలో అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది.

హైదరాబాద్ : వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల బరిలో అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. అందులోభాగంగా గురువారం గాంధీభవన్లో ఆ జిల్లా నేతలతో ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ భేటీ అయ్యారు. అభ్యర్థి ఎంపికపై పార్టీ నేతల అభిప్రాయాలను దిగ్విజయ్ సింగ్ సేకరిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల బరిలో వెంకటస్వామి తనయుడు, మాజీ ఎంపీ వివేక్ను నిలపాలని జిల్లా నేతలు కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు.

పోటీ చేసేందుకు వివేక్ విముఖత చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల బరిలో ఎవరిని నిలిపితే బాగుంటుందని దిగ్విజయ్ సింగ్ ... వరంగల్ జిల్లా నేతలను కోరారు. ఆ క్రమంలో సర్వే సత్యనారాయణ, ఎస్. రాజయ్య, ఆర్ ప్రతాప్ పేర్లు మాత్రం వారు వెల్లడించారు. కాగా వీరిలో ఎవరినీ ఎంపిక చేయాలనేది మాత్రం కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement