నిశ్చితార్థం అయ్యాక నచ్చలేదన్నాడని.. | A girl suicide | Sakshi
Sakshi News home page

నిశ్చితార్థం అయ్యాక నచ్చలేదన్నాడని..

Aug 6 2015 4:09 AM | Updated on Nov 6 2018 7:56 PM

- అనూష (ఫైల్) - Sakshi

- అనూష (ఫైల్)

నిశ్చితార్థం చేసుకున్న యువకుడు అమ్మాయి నచ్చలేదని పెళ్లికి నిరాకరించడంతో మనస్థాపానికి గురైన ఓ యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాలానగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది...

బాలానగర్: నిశ్చితార్థం చేసుకున్న యువకుడు అమ్మాయి నచ్చలేదని పెళ్లికి నిరాకరించడంతో మనస్థాపానికి గురైన ఓ యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాలానగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది.  బాలానగర్ సీఐ సైదులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.  నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన భూలక్ష్మి తన ఇద్దరు పిల్లలతో సహా వినాయక్‌నగర్‌లో నివాసముంటోంది.

ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆమె కుమార్తె అనూషగౌడ్‌కు నిజామాబాద్ జిల్లాకు చెందిన సందీప్‌గౌడ్ (26)తో   జూన్ 7వ తేదీన  నిశ్చితార్థం జరిగింది. అప్పటి నుంచీ వీరిద్దరు తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఇదిలా ఉండగా మంగళవారం సందీప్‌గౌడ్ అనూషకు ఫోన్ చేసి నువ్వంటే నాకిష్టం లేదు. వేరే అబ్బాయిని పెళ్లి చేసుకో అని చెప్పడంతో మనస్థాపానికి లోనైన ఆమె తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో ఆమె ఇంటికి వచ్చి కుమార్తెను ఓదార్చి తిరిగి డ్యూటీకి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగాసాయంత్రం వంటగదిలో కొక్కేనికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement