కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు.
ఖమ్మం: కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. కేసీఆర్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని, ఎమ్మెల్యేపై దాడిచేసిన గువ్వల బాలరాజును తనతో పాటు చైనాకు తీసుకెళ్లటంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. రైతులు పిట్టల్లా రాలుతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైతులకు రుణాలు ఇప్పించాలని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టివిక్రమార్క, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.