స్కూలు బస్సు బోల్తా: ఏడుగురికి గాయాలు | 7 students injured in school bus accident at mahabub nagar | Sakshi
Sakshi News home page

స్కూలు బస్సు బోల్తా: ఏడుగురికి గాయాలు

Jul 29 2015 10:09 AM | Updated on Oct 8 2018 5:04 PM

స్కూలు బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఏడుగురు విద్యార్థులు గాయాలపాలయ్యారు.

వీపనగండ్ల: స్కూలు బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఏడుగురు విద్యార్థులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా వీపనగండ్ల సమీపంలో బుధవారం ఉదయం జరిగింది. స్థానిక వివేకానంద కాన్సెప్టు స్కూలు బస్సు తెల్లంపాడు నుంచి 38 మంది విద్యార్థులతో వెలటూరు వైపు వెళ్తోంది.

గ్రామ సమీపంలో బ్రేక్ సరిగా పడకపోవటంతో డ్రైవర్ రాజ్‌కుమార్ బస్సుపై అదుపు కోల్పోయాడు. దీంతో బస్సు రోడ్డు పక్కకు జారి బోల్తా పడింది. దీంతో బస్సులోని ఏడుగురు విద్యార్థులు గాయపడ్డారు. వారికి స్థానికంగా ప్రథమ చికిత్స చేసి,  మెరుగైన వైద్యం కోసం 108లో కొల్లాపూర్ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement