స్కూల్ బస్సు బోల్తా: 30 మంది విద్యార్థులకు గాయాలు | 30 students injured in School bus overturns in mahabubnagar district | Sakshi
Sakshi News home page

స్కూల్ బస్సు బోల్తా: 30 మంది విద్యార్థులకు గాయాలు

Nov 8 2013 9:11 AM | Updated on Oct 8 2018 5:04 PM

మహబూబ్నగర్ జిల్లా పెబ్బేరు మండలం శ్రీరంగాపూర్ గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం విద్యార్థులతో వెళ్తున్న ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది.

మహబూబ్నగర్ జిల్లా పెబ్బెరు మండలం శ్రీరంగాపూర్ గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం విద్యార్థులతో వెళ్తున్న ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఆ ఘటనలో 30 మంది విద్యార్థులు గాయపడ్డారు. దాంతో రహదారిపై వెళ్తున్న వాహనదారులు, స్థానికులు వెంటనే స్పందించి బొల్తా పడిన బస్సులోంచి విద్యార్థులను బయటకు తీసి, 108 కు సమాచారం అందించారు. 

 

దాంతో విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు స్వల్పంగానే గాయాలయ్యాయని వైద్యులు వెల్లడించారు. అయితే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో స్కూల్ బస్సు బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని స్కూల్ బస్సును రహదారిపై నుంచి పక్కకు తప్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement