రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి | 2 engineering students died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి

Aug 21 2015 9:52 AM | Updated on Jul 11 2019 6:33 PM

గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు.

సంబేపల్లి: గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున వైఎస్సార్ జిల్లా సంబేపల్లి మండల కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపం సమీపంలో జరిగింది. వివరాలు.. మండలంలోని దుద్యాలకు చెందిన పవన్‌కుమార్, చిత్తూరు జిల్లా పూతలపట్టుకు చెందిన శివకుమార్‌రెడ్డితో కలిసి కాలేజీకి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో శివకుమార్‌రెడ్డి(21) అక్కడికక్కడే మృతి చెందాడు.

తీవ్రంగా గాయపడిన పవన్‌కుమార్‌ను  స్థానికులు రాయచోటిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో రాయచోటి నుంచి వేలూరు కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. వీరిద్దరూ తిరుపతిలోని రాయలసీమ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శివ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement