సాక్షిప్రతినిధి, నల్లగొండ,జిల్లా పరిషత్ ఎన్నికలు ఆసక్తి గొల్పుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు అత్యధిక జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకునే పనిలో పడ్డాయి. కాంగ్రెస్ పార్టీలో జెడ్పీ రాజకీయం కొత్త సమీకరణలకు తెర లేపుతోంది. మాజీ మంత్రి కె.జానారెడ్డి ఈసారి కూడా జెడ్పీ పీఠంపై తనకు కావాల్సిన వ్యక్తినే కూర్చోబెట్టే పనిలో పడ్డారు. జెడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థులను బరిలోకి దింపే దశ నుంచే కాంగ్రెస్ ఆచితూచి అడుగేసింది. సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో టికెట్ల కేటాయింపు, పొత్తులను ముందే పరిగణనలోకి తీసుకుని ముందస్తు వ్యూహంతో ముందుకు వెళ్లింది.
కాంగ్రెస్, సీపీఐల మధ్య ఎన్నికల పొత్తుకు అవకాశాలు ఎక్కువగా ఉండడాన్ని కీలకంగానే భావించారు. దీనిలో భాగంగానే దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ను జెడ్పీ బరిలోకి దింపారు. ఆయన చందంపేట జెడ్పీటీసీ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. వాస్తవానికి ముందు నుంచీ ఈసారి బాలూనాయక్కు అసెంబ్లీ టికెట్ ఇవ్వరన్న ప్రచారం జోరుగా జరగడంతో ఆయన కూడా ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది. అయితే, ఎన్నికల పొత్తులో భాగంగా సీపీఐ బలంగా కోరే అసెంబ్లీ స్థానాల్లో దేవరకొండ ఒకటి కావడంతో, ఈసారి కూడా కచ్చింతా ఈ సీటును అడుగుతారని భావించారు. పొత్తు లేని పక్షంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకే అవకాశం దక్కే వీలున్నా, ఒకవేళ పొత్తు ఖరారు అయితే మాత్రం ఏమీ చేయలేమని, వారు కోరే దేవ రకొండను వదులు కోవాల్సి వస్తుందని బాలూనాయక్కు కొందరు సూచించినట్లు చెబుతున్నారు.
దీంతో ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొనే ఎమ్మెల్యే బాలూ జెడ్పీ పోటీలో ఉన్నట్లు చెబుతున్నారు. మరోైవె పు దేవరకొండ కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసిన మాజీ ఎమ్మెల్యే రాగ్యానాయక్ తనయుడు స్కైలాబ్నాయక్ దామరచర్ల జెడ్పీటీసీ స్థానానికి, జెడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ లచ్చిరాం నాయక్ పెద్దవూర జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు.
దీంతో జెడ్పీచైర్మన్ పీఠానికి గట్టిపోటీ ఉంటుందని అంతా భావించారు. అయితే, జానారెడ్డి చొరవ తీసుకుని వారిద్దరూ తమ నామినేషన్లను ఉపసంహరింపజేసుకునేలా చక్రం తిప్పారు. ఇప్పటికే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్కుమార్రెడ్డి కోదాడ, హుజూర్నగర్ ప్రాంతాలకు ముఖ్యమైన పదవులు ఇప్పించుకున్నారు. ఇక, మిగిలింది సూర్యాపేట ప్రాంతమే. దీంతో ముందే మేల్కొన్న జానారెడ్డి, జెడ్పీ పీఠంపై తన ముద్ర వేసేందుకు ఏకంగా ఎమ్మెల్యే బాలూనాయక్నే ముందు పెట్టారు.
మరోవైపు కాంగ్రెస్ తర్వాత అత్యధిక స్థానాల్లో పోటీలో ఉన్న టీఆర్ఎస్ స్థానిక రాజకీయం గురించి ఏ అంచనాకూ రాలేని పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ నుంచి జిల్లా అధ్యక్షుడు బిల్యానాయక్ భార్య అనిత చింతపల్లి జెడ్పీటీసీ స్థానం నుంచి బరిలో ఉంది. కానీ టీడీపీ కేవలం 48 స్థానాల్లోనే పోటీ చేసింది.
కాకుంటే ఆయా మండలాల్లో అవసరాలను బట్టి టీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ, సీపీఎం తదితర పార్టీలతో అవగాహన కుదుర్చుకుంది. ఒక విధంగా చెప్పాలంటే, కాంగ్రెస్ ఒక వైపు, మిగిలిన పార్టీలు ఒక వైపు ఉండి జిల్లా పరిషత్ అధ్యక్ష పదవి కోసం పోరాటం చేస్తున్నాయి.
రసవత్తరం.. జెడ్పీ జంగ్
Published Mon, Mar 31 2014 11:59 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సూప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement